చెస్‌ ఒలింపియాడ్‌లో ఇండియాకు తొలి డ్రా

చెస్‌ ఒలింపియాడ్‌లో ఇండియాకు తొలి డ్రా

బుడాపెస్ట్‌: చెస్‌ ఒలింపియాడ్‌లో ఇండియా మెన్స్‌ టీమ్‌ తొలి డ్రా నమోదు చేసింది. గురువారం ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన జరిగిన తొమ్మిదో రౌండ్‌ను ఇండియా 2–2తో డ్రా చేసుకుంది. తెలంగాణ గ్రాండ్‌ మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌.. వకిడోవ్‌ శంసుద్దీన్‌ మధ్య జరిగిన గేమ్‌ 70 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఇక గుకేశ్‌.. నొడిర్బెక్‌, ప్రజ్ఞానంద.. సిందరోవ్‌ జావోకిర్‌, విదిత్‌ సంతోష్‌... వాకిడోవ్‌ జాకోంగిర్‌ మధ్య జరిగిన గేమ్‌లు డ్రాగా ముగిశాయి. 

విమెన్స్‌ సెక్షన్‌లో అమెరికాతో జరిగిన మ్యాచ్​ను కూడా ఇండియా 2–2తో డ్రా చేసుకుంది. తొకిర్‌జోనోవాతో జరిగిన గేమ్‌లో ఆర్‌. వైశాలి 34 ఎత్తుల వద్ద ఓడింది. దివ్య దేశ్‌ముఖ్‌.. యిప్‌ కారిస్సాతో జరిగిన గేమ్‌ 27 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. దీంతో ఇరుజట్ల స్కోరు 1.5–1.5 అయ్యింది. ఈ దశలో వంతికా అగర్వాల్‌.. క్రుష్‌ ఐరినాతో జరిగిన గేమ్‌ను 35 ఎత్తుల వద్ద గెలుచుకుంది. కానీ లీ అలిస్‌తో జరిగిన గేమ్‌లో తానియా సచ్‌దేవ్‌ 29 ఎత్తుల వద్ద డ్రాగా ముగించింది.