దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే పరాగ్​ షా

దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే పరాగ్​ షా
  • ఆయన సంపద రూ. 3,400 కోట్లు

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత రిచెస్ట్​ఎమ్మెల్యేగా ముంబైలోని ఘాట్​కోపర్​కు చెందిన పరాగ్​షా నిలిచారు. బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఆస్తుల విలువ రూ. 3,400 కోట్లుగా అంచనా. ఆ తర్వాతి స్థానంలో రూ. 1,413 కోట్ల సంపదతో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌ నిలిచారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లను అసోసియేషన్​ఫర్​డెమొక్రటిక్​ రిఫార్స్మ్​ ( ఏడీఆర్‌‌‌‌) పరిశీలించింది.

 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 4,092 ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యాన్ని విశ్లేషించింది. అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్​కు చెందిన ఎమ్మెల్యే నిర్మల్​ కుమార్​ ధారా నిలిచారు. ఇండాస్​ నియోజకవర్గానికి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన సంపద కేవలం రూ. 1700 అని ఏడీఆర్​ తేల్చింది.