దేశంలో ఒక్కరోజే 2,411 కరోనా కేసులు.. ఇప్పటిదాకా ఇదే హయ్యెస్ట్

దేశంలో ఒక్కరోజే 2,411 కరోనా కేసులు.. ఇప్పటిదాకా ఇదే హయ్యెస్ట్

దేశంలో శ‌నివారం రికార్డుస్థాయిలో క‌రోనా కేసులు పెరిగిపోయాయి. ఒక్కరోజులో ఏకంగా 2,411 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన హయ్యెస్ట్​ కేసుల సంఖ్య ఇదే. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 37776కు చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం ఐదు గంట‌ల బులెటెన్ లో వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1223 మంది మ‌ర‌ణించగా.. ఇవాళ ఒక్క రోజే 71 మంది చ‌నిపోయారు. అలాగే శ‌నివారం నాడు మొత్తం 953 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కావ‌డంతో ఈ సంఖ్య 10018 మందికి చేరింది. ప్ర‌స్తుతం 26,535 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మ‌హారాష్ట్ర‌లో 11 వేలు దాటిన క‌రోనా కేసులు

దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 11506 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాత గుజ‌రాత్లో 4721 మందికి, ఢిల్లీలో 3738 మందికి వైర‌స్ సోకింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 2719, రాజ‌స్థాన్ లో 2666, త‌మిళ‌నాడులో 2526, యూపీలో 2455 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఏపీలో 1525, తెలంగాణ‌లో 1057, ప‌శ్చిమ బెంగాల్ లో 795, పంజాబ్ లో 772 కేసులు న‌మోద‌య్యాయి.