భారత్లో ఇంటర్నెట్పై ఆంక్షలు..యాక్సెస్ ​నౌ సంచలన విషయాలు వెల్లడి

భారత్లో ఇంటర్నెట్పై ఆంక్షలు..యాక్సెస్ ​నౌ సంచలన విషయాలు వెల్లడి

ఇంటర్నెట్​పై ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిరంకుశ పాలన సాగిస్తున్న చైనా, ఉత్తర కొరియా, రష్యా వంటి దేశాల్లో ఇంటర్నెట్​ను సెన్సార్ చేయడం, పరిమితులు విధించడం వంటి ఆంక్షలు ఉన్నాయి. 

భారత్​ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో పౌరులకు ఇంటర్నెట్ హైస్పీడ్ తో అందుబాటులో  ఉంది. అయితే భారత్​ లో కూడా బ్లాక్​ అవుట్(ఇంటర్నెట్​ షట్ డౌన్) అమలు చేయడం జరుగుతోందని యాక్సెస్​నౌ డేటా వెల్లడించింది. 

డిజిటల్​రైట్స్​ వాచ్​ డాగ్​ యాక్సెస్​ నౌ షేర్​ చేసిన డేటా ప్రకారం.. దాదాపు గడిచిన పదేళ్లలో ఇంటర్నెట్​ షట్​ డౌన్​ లలో భారత్​మొదటిస్థానంలో ఉంది. 2016 నుంచి 2023 వరకు భారత్​ లో 771 సార్టు ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. ఒక్క 2024లో నే 51సార్లు భారత్​ ఇంటర్నెట్​పై ఆంక్షలు విధించారు. 

మయన్మార్​, ఉక్రెయిన్ వరుసగా 2022,2023లో ఇంటర్నెట్​ షట్ డౌన్​ ల జాబితాలు రెండో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల్లో అంతర్గత కల్లోలాలు, ఘర్షణలు తీవ్రస్థాయిలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. 

గతేడాది భారత ప్రభుత్వం 116 సార్లు ఇంటర్నెట్​పై ఆంక్షలు విధించిందని యాక్సెస్​ నౌ డేటా వెల్లడించింది. మయన్మార్​ , ఇరాన్​ 37, 34 షట్​ డౌన్​ లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 2024లో ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఇంటర్నెట్​ కనెక్టివిటీ తగ్గించడంలో భారత్​మొదటి స్థానంలో మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.