IND vs BAN: నేటి(అక్టోబర్ 05) నుంచి ఉప్పల్ టీ20 టికెట్ల సేల్‌‌‌‌‌‌‌‌

IND vs BAN: నేటి(అక్టోబర్ 05) నుంచి  ఉప్పల్ టీ20 టికెట్ల సేల్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇండియా, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ మధ్య ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12న జరిగే మూడో టీ20 మ్యాచ్ టికెట్ల సేల్  శనివారం మొదలవనుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటీఎం ఇన్‌‌‌‌‌‌‌‌సైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెబ్‌‌‌‌‌‌‌‌సైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌లో టికెట్లను విక్రయిస్తున్నట్టు హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రెసిడెంట్​ జగన్ మోహన్ రావు తెలిపారు. టికెట్ల కనీస ధర రూ. 750,  గరిష్ట ధర రూ. 15 వేలుగా ఉందన్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో కొన్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు  జింఖానా స్టేడియంలో రిడెంప్షన్‌‌‌‌‌‌‌‌ చేసుకొని ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు. ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో టికెట్లను నేరుగా అమ్మడం లేదని స్పష్టం చేశారు.