సభలో పాక్ ప్రధానికి భారత దౌత్యవేత్త కౌంటర్

సభలో పాక్ ప్రధానికి భారత దౌత్యవేత్త కౌంటర్

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి జనరల్​ అసెంబ్లీ (యూఎన్​జీఏ) వేదికగా జమ్మూకాశ్మీర్​పై పాకిస్తాన్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ చేసిన కామెంట్లకు అదే వేదికగా భారత్​ గట్టి కౌంటర్​ ఇచ్చింది.

 పాలస్తీనాలో మాదిరిగా జమ్మూ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, ఆర్టికల్​ 370 రద్దు చేయడం హేయమైన చర్య అంటూ షరీఫ్​ చేసిన వ్యాఖ్యలను ఇండియా దౌత్యవేత్త భవికా మంగళానందన్​ తీవ్రంగా తప్పుబట్టారు. 

యూఎన్​లో ఆమె మాట్లాడుతూ.. మిలిటరీ సహకారంతో నడుస్తూ, టెర్రరిజాన్ని ఇతర దేశాలపైకి ఉసిగొల్పే ఓ దేశం ప్రపంచ వేదికలపై ఇండియా మీద విషం వెళ్లగక్కుతున్నదని మండిపడ్డారు.