లావోస్​లో 47 మందిఇండియన్లకు విముక్తి

లావోస్​లో 47 మందిఇండియన్లకు విముక్తి
  • సైబర్ స్కామ్ కేంద్రాల నుంచి రక్షించిన ఇండియన్ ఎంబసీ

వియాంటినె (లావోస్) : లావోస్​లోని సైబర్ స్కామ్ సెంటర్స్​లో చిక్కుకున్న 47 మంది భారతీయులను ఇండియన్ ఎంబసీ రక్షించింది. బోకియో ప్రావిన్స్​లోని గోల్డెన్ ట్రయాంగిల్ స్పెషల్ ఎకనామిక్ జోన్(సెజ్) కేంద్రాల నుంచి వీరిని కాపాడింది. ఈమేరకు శనివారం అక్కడి ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. లావోస్​లోని సైబర్ స్కామ్ సెంటర్స్ లో 47 మంది ఇండియన్లు చిక్కుకున్నారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో వీరిలో 

29 మందిని లావోస్ అధికారులు ఎంబసీకి అప్పగించారు.  మిగిలిన 18 మంది సాయం కోసం ఎంబసీని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఎంబసీ అధికారులు వియాంటినె నుంచి బోకియోకు వచ్చి వారిని రక్షించారు. లావోస్ అధికారులతో సంప్రదింపులు జరిపి ఇండియాకు పంపించే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటి వరకు లావోస్​లో 635 మంది ఇండియన్స్ ను కాపాడి, భారత్​కు సురక్షితంగా తరలించినట్టు ఎంబసీ పేర్కొంది.