నేవీ అమ్ములపొదిలోకి ఎస్ఎస్​బీఎన్​ అరిఘాత్​

నేవీ అమ్ములపొదిలోకి ఎస్ఎస్​బీఎన్​ అరిఘాత్​

న్యూఢిల్లీ: భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో బ్రహ్మాస్తం చేరింది. కెనడాతో దౌత్యపరమైన విభేదాల నడుమ దేశ తొలి బాలిస్టిక్​ క్షిపణి వ్యవస్థ కలిగిన నాలుగో న్యూక్లియర్​ సబ్​మెరైన్(ఎస్ఎస్​బీఎన్)​  అరిఘాత్​ను ఇండియన్​ నేవీ ఆవిష్కరించింది. విశాఖ తీరంలోని షిప్ బిల్డింగ్ సెంటర్(ఎస్​బీసీ) వద్ద ఈ జలాంతర్గామిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్ ఆవిష్కరించినట్టు తెలిసింది. తెలంగాణలోని వికారాబాద్​ జిల్లా దామగుండంలో నేవీ రాడార్​ 

కేంద్రానికి శంకుస్థాపన చేసిన మరుసటిరోజు ఈ సబ్​మెరైన్​ను జలప్రవేశం చేయించినట్టు అధికార వర్గాల సమాచారం.

ఆగస్టులో నేవీకి అప్పగింత

ఎస్ఎస్​బీఎన్​ అరిఘాత్​ను ఈ ఏడాది ఆగస్టు 29న నౌకాదళానికి రాజ్​నాథ్​ సింగ్​ అప్పగించారు. దీన్ని 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. 3,500 కిలో మీటర్ల దూరంలోని టార్గెట్​ను సైతం ఛేదించేలా ఇందులో కే4 న్యూక్లియర్  బాలిస్టిక్  మిసైల్స్​ను అమర్చారు. భద్రతా కారణాలరీత్యా వీటిని మొదట కోడ్ నేమ్​తో పిలుస్తారు. ఇందులో భాగంగా దీనికి ‘ఎస్​4 స్టార్’​గా నామకరణం చేశారు.  కాగా, వచ్చే ఏడాదికి ఈ శ్రేణిలో నాలుగో సబ్‌‌‌‌మెరైన్‌‌‌‌ ఐఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ అరిధమాన్‌‌‌‌ను సిద్ధం చేయనున్నట్లు నేవీ అధికారులు పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ రీజియన్​లో శత్రువులను ఎదుర్కోవడంలో ఈ సబ్​మెరైన్లు కీలక పాత్ర పోషిస్తాయని భారత్​ భావిస్తోంది.