అమెరికాలో నేపాల్ స్టూడెంట్ హత్య

అమెరికాలో నేపాల్ స్టూడెంట్ హత్య
  • నిందితుడు భారత సంతతి వ్యక్తి

హ్యూస్టన్ : అమెరికాలో నేపాల్ స్టూడెంట్ హత్యకు గురైంది. ఆమెను భారత సంతతి వ్యక్తి కాల్చి చంపాడు. నేపాల్ కు చెందిన మునా పాండే (21) స్టడీ కోసం 2021లో అమెరికా వెళ్లింది. హ్యూస్టన్ లోని కమ్యూనిటీ కాలేజీలో చదువుకుంటున్నది. అక్కడే అపార్ట్ మెంట్​లో నివాసం ఉంటున్నది. గత సోమవారం మునా పాండే ఫ్లాట్​కు ఓ దొంగ వచ్చాడు. ఆమె అడ్డుకోవడంతో కాల్పులు జరిపి పరారయ్యాడు. 

అదేరోజు సాయంత్రం 5:30 గంటలకు మునా పాండే డెడ్ బాడీని అపార్ట్​మెంట్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్​కు వచ్చి పరిశీలించిన పోలీసులు.. బుల్లెట్ గాయాలతో మునా పాండే చనిపోయిందని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఫ్లాట్​కు దొంగ వచ్చిన విషయం బయటపడింది. అతడిని భారత సంతతికి చెందిన బాబీ సిన్హా షా(52)గా గుర్తించి, హత్యా నేరం కింద అరెస్టు చేశారు.