
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన 42 ఏండ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాకు చెందిన సుఖ్విందర్ సింగ్గా గుర్తించారు. ఈ నెల 12న ఇండియానా పొలిస్ సమీపంలోని గ్రామీణ గ్రీన్వుడ్ ఏరియాలో సుఖ్విందర్ సింగ్ తన హోండా అకార్డ్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆయన కారు అదుపుతప్పి ఎదురుగా ఉన్న లేన్లోకి వెళ్లి ఎదురుగా వచ్చిన వెహికల్ నుఢీకొట్టింది. దీంతో సింగ్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 13న మృతిచెందాడు. అలాగే, ఎదురుగా వచ్చిన కారు డ్రైవర్, కారులో ఉన్న మరో మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని కూడా ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి తరలించారు.