- గడువు తగ్గించిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ, వెలుగు: టికెట్ రిజర్వేషన్ల కు సంబంధించి ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రయాణానికి 120 రోజుల ముందు బుకింగ్ చేసుకునే వీలుండగా.. దానిని 60 రోజులకు తగ్గించింది.
ఈ నూతన అడ్వాన్స్ డ్ రిజర్వేషన్ పీరియడ్ (ఏఆర్పీ) కొత్త నిబంధన 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
ప్రయాణికుల కు మెరుగైన సౌకర్యం కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం రైల్వే శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. అయితే, పగటి పూట నడిచే తాజ్ ఎక్స్ ప్రెస్, గోమతి ఎక్స్ ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్లో ఎటువంటి మార్పు లేదు.
విదేశీయులు 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. ఇందులోనూ మార్పు చేయలేదు.