
లిమా (పెరూ): ఇండియా షూటర్లు అర్జున్ బబుతా, రుద్రాంక్ష్ పాటిల్–ఆర్యా బోర్సే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో సిల్వర్ మెడల్స్తో మెరిశారు. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆయుష్ రజతం గెలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో అర్జున్ 252.3 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
కేవలం 0.1 పాయింట్ తేడాతో గోల్డ్ మెడల్ కోల్పోయాడు. ఫైనల్లో పోటీ పడ్డ రుద్రాంక్ష్ 11వ షాట్ను టెక్నికల్ కారణాలతో జ్యూరీ రద్దు చేయడంతో అతను ఆరంభంలోనే ఫైనల్ నుంచి వెనుదిరిగాడు. మరోవైపు10 మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ గోల్డ్ మెడల్ మ్యాచ్లో రుద్రాంక్ష్–ఆర్యా 11–17తో నార్వేకు చెందిన జాన్-హెర్మన్– జెనెట్ హెగ్ చేతిలో ఓడి సిల్వర్తో తిరిగొచ్చింది.