
ఇండియా యంగ్ ప్లేయర్ సుమిత్ నగాల్.. ఒలింపిక్ టెన్నిస్లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో నగాల్ 2–6, 6–2, 5–7తో కొరెంటిన్ మౌటెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు.
స్విమ్మర్లకు నిరాశ..
స్విమ్మర్లు శ్రీహరి నటరాజ్, ధినిధి దేసింగ్ హీట్స్లోనే వెనుదిరిగారు. 100 మీ. బ్యాక్స్ట్రోక్ హీట్స్లో నటరాజ్ 55.01 సెకన్లతో 33వ ప్లేస్తో సరిపెట్టుకున్నాడు. విమెన్స్ 200 మీ. ఫ్రీస్టయిల్ హీట్లో 14 ఏళ్ల ధినిధి 2:06.96 సెకన్లతో 23వ ప్లేస్లో నిలిచింది. దీంతో ఈ ఇద్దరూ సెమీస్కు అర్హత సాధించలేకపోయారు. హీట్స్లో టాప్–16లో నిలిచిన స్విమ్మర్లు సెమీస్కు క్వాలిఫై అవుతారు.