
వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత మహిళల ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. వరుసగా మూడు ప్రపంచకప్ గోల్డ్ మెడల్స్ సాధించి హ్యాట్రిక్ కొట్టింది. శనివారం(జూన్ 22) టర్కీ వేదికగా జరిగిన ప్రపంచ కప్ స్టేజ్ 3 ఫైనల్లో భారత ఆర్చరీ త్రయం.. ఎస్టోనియాకు చెందిన లిసెల్ జాత్మా, మరిటా పాస్, మారిస్ టెట్స్మన్లను 232-229 తేడాతో ఓడించింది.
గతంలో షాంఘై, యెచియోన్లలో వరుసగా స్టేజ్ 1 మరియు 2లో గోల్డ్ మెడల్ గెలుచుకోవడం ద్వారా ప్రపంచ కప్లో ఇది వారికి వరుసగా మూడో బంగారు పతకం. ఈ విజయంతో భారత మహిళల ఆర్చరీ జట్టు ప్రపంచ నం.1 ర్యాంకును కైవసం చేసుకుంది.
Indian Compound Women's Team won 3️⃣rd consecutive GOLD🥇at Archery World Cup 🤩🇮🇳pic.twitter.com/qzt0JGJc1R
— The Khel India (@TheKhelIndia) June 22, 2024