
న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారి ఇంటర్నెట్ డీ–అడిక్షన్ సెంటర్ను ఢిల్లీలోని ఎయిమ్స్లో ఏర్పాటు చేయనున్నారు. టెక్నాలజీ అధిక వినియోగం, దాని ద్వారా వచ్చే సమస్యల పరిష్కారానికి సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ అడిక్టివ్ బిహేవియర్స్ (సీఏఆర్–ఏబీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రపోజల్కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును ఎయిమ్స్లోని బిహేవియరల్ అడిక్షన్స్ క్లినిక్ (బీఏసీ) ఫ్యాకల్టీ ఇన్చార్జ్ డాక్టర్ యతన్పాల్ సింగ్ బల్హారా లీడ్ చేస్తున్నారు.
‘‘టెక్నాలజీని అధికంగా, సమస్యాత్మకంగా వినియోగించడం ఇప్పుడు మేజర్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్గా మారింది. పిల్లలు, యువతలో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగాయని ఎకనామిక్ సర్వే 2024–25లో తేలింది. వాళ్లను ఇంటర్నెట్కు దూరంగా ఉంచాలని సర్వే సూచించింది. అందుకే దేశంలోనే తొలిసారి ఎయిమ్స్లో ఇంటర్నెట్ డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంటర్నెట్, టెక్నాలజీ రీలేటెడ్ అడిక్షన్స్కు సంబంధించి ప్రివెన్షన్, స్ర్కీనింగ్, ఎర్లీ డిటెక్షన్ దీని ముఖ్య ఉద్దేశాలు” అని డాక్టర్ బల్హారా పేర్కొన్నారు.