ధనిక దేశం కావాలంటే ఏటా 7.8శాతం గ్రోత్​ రావాలి

ధనిక దేశం కావాలంటే ఏటా 7.8శాతం గ్రోత్​ రావాలి
  • ప్రపంచ బ్యాంకు అంచనా

న్యూఢిల్లీ:ఇండియా 2047 నాటికి సంపన్న దేశంగా మారాలంటే ఏటా 7.8 శాతం జీడీపీ గ్రోత్​ సాధించాలని, ఇందుకోసం చాలా సంస్కరణలు తేవాలని ప్రపంచ బ్యాంకు రిపోర్టు పేర్కొంది. దీని ప్రకారం..  భూ సంస్కరణలను,  కార్మిక సంస్కరణలను అమలు చేయాలి. జీఎన్​ఐ పర్​క్యాపిటా ఎనిమిది రెట్లు పెరగాలి. జీఎన్‌‌ఐ తలసరి అంటే ఒక దేశ స్థూల జాతీయ ఆదాయాన్ని ఆ దేశ మధ్య సంవత్సరం జనాభాతో భాగించగా వచ్చేది. అంటే, ఒక దేశంలోని ఒక్కో వ్యక్తి సగటు ఆదాయం ఎంత అని తెలుసుకోవచ్చు. 

ఇండియా 2000 నుంచి 2024 వరకు ఏటా 6.3 శాతం వరకు గ్రోత్​ సాధించింది. ఈ లెక్కన భవిష్యత్​ టార్గెట్లనూ చేరుకోవడానికి అవకాశం ఉంది. గ్లోబల్​ మాన్యుఫాక్చరింగ్​ హబ్​గా మారడానికి, ఇన్​ఫ్రాను పెంచడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. డిజిటైజేషన్​ను, హ్యూమన్​ క్యాపిటల్​ను పెంచడానికీ చర్యలు తీసుకుంది.  

గ్లోబల్​ఎకానమీకి మరింత దగ్గర కావడం ద్వారా చిలీ, కొరియా, పోలండ్​ వంటి దేశాలు మధ్య ఆదాయ దేశాల నుంచి సంపన్న దేశాలుగా మారాయని, వీటి నుంచి ఇండియా నేర్చుకోవాలని వరల్డ్​బ్యాంక్​ ఇండియా కంట్రీ డైరెక్టర్​ అగస్టీ టనో అన్నారు.