
న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్, వంట, పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగించే కంప్రెస్డ్ నేచురల్గ్యాస్(సీఎన్జీ) వాడకం 2030 నాటికి దాదాపు 60 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆయిల్ రెగ్యులేటర్ పీఎన్జీఆర్బీ తెలిపింది. కరెంటు, ఎరువుల తయారీకి కూడా వాడే ఈ గ్యాస్ వాడకం 2023–-24లో రోజుకు 188 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు ఉండగా, 2030 నాటికి 297 ఎంఎంఎస్సీఎండీలకు పెరుగుతుందని పెట్రోలియం, నేచురల్గ్యాస్రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్బీ) స్టడీ తెలిపింది.
దీని వినియోగం 2040 నాటికి ఇది 496 ఎంఎంఎస్సీఎండీలకు చేరుతుందని అంచనా. పీఎన్జీఆర్బీ ఇటీవలి సంవత్సరాలలో 307 ప్రాంతాలకు సిటీ గ్యాస్ లైసెన్స్లను మంజూరు చేసింది. వీటితో దేశమంతటికీ గ్యాస్ సరఫరా అవుతోందని తెలిపింది.