గత నెల పెరిగిన ఎగుమతులు.. 21 బిలియన్ డాలర్లకు పెరిగిన వాణిజ్యలోటు

గత నెల పెరిగిన ఎగుమతులు.. 21 బిలియన్ డాలర్లకు పెరిగిన వాణిజ్యలోటు

న్యూఢిల్లీ: మనదేశం నుంచి ఎగుమతులు మార్చిలో 0.7 శాతం పెరిగి  41.97 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య లోటు 21.54 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 0.08 శాతం పెరిగి  437.42 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతులు 6.62 శాతం పెరిగి  720.24 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీని వలన  282.82 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడింది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో వాణిజ్య లోటు  14.05 బిలియన్ డాలర్లు ఉంది. గత ఏడాది మార్చిలో ఎగుమతులు,  దిగుమతుల మధ్య తేడా 15.33 బిలియన్ డాలర్లు ఉంది. 2023–-24లో ఇది  241.14 బిలియన్ డాలర్లుగా రికార్డు అయింది. దిగుమతుల వృద్ధి నాలుగు నెలల గరిష్ట స్థాయి 11.3 శాతం పెరిగి మార్చిలో  63.51 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

మొత్తం వస్తువులు,  సేవల ఎగుమతులు 2024-–25లో  820.93 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరుకుంటాయని అంచనా. 2023–-24లోఔట్‌బౌండ్ షిప్‌మెంట్ల విలువ  778.13 బిలియన్ డాలర్లుగా నమోదయిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.