ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

శంషాబాద్, వెలుగు: ఆగంతకుడి నుంచి బాంబు బెదిరింపు రావడంతో ఇండిగో విమానాన్ని 6 గంటలపాటు ఎయిర్​పోర్టులోనే నిలిపివేశారు. కోయంబత్తూర్ టు చెన్నై వయా హైదరాబాద్ ఇండిగో విమానం గురువారం శంషాబాద్​కు వచ్చింది. 181 మంది ప్యాసింజర్లతో టేకాఫ్​కు సిద్ధంగా ఉండగా, ఎయిర్​పోర్టు అధికారులకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు. 

దీంతో అప్రమత్తమైన ఎయిర్​పోర్టు అధికారులతో పాటు సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్, ఆర్జీఐఏ పోలీసులు బాంబు స్క్వాడ్ ఆరు గంటలపాటు విమానాన్ని తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్ధారించిన తర్వాత ఫ్లైట్​ను టేకాఫ్​​కు అనుమతించారు.