ఇండిగో ఫ్లైట్‌‌‌‌లో 4 గంటలకు పైగా వెయిటింగ్‌‌‌‌

ఇండిగో ఫ్లైట్‌‌‌‌లో  4  గంటలకు పైగా వెయిటింగ్‌‌‌‌

న్యూఢిల్లీ: ముంబై నుంచి దోహా (ఖతర్‌‌‌‌‌‌‌‌) కు వెళ్లే  ఇండిగో విమానం  ప్యాసింజర్లను ఇబ్బంది పెట్టింది. టెక్నికల్ సమస్య కారణంగా  విమానంలోనే  నాలుగు గంటలకు పైగా ప్రయాణికులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫ్లైట్ ఆలస్యం కావడంపై చాలా మంది ప్యాసింజర్లు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.

  చివరికి ఈ ఫ్లైట్ ఆదివారం ఉదయం టేకాఫ్ అయ్యింది. ముంబై – దోహా రూట్‌‌‌‌లో తిరిగే   ఫ్లైట్ 6ఈ 1303  టెక్నికల్ సమస్య కారణంగా ఆలస్యంగా టేకాఫ్ అయ్యిందని ఇండిగో పేర్కొంది.  కస్టమర్ల కోసం  అవసరమైన ఏర్పాటులు చేశామని తెలిపింది.