
యాదాద్రి, వెలుగు : అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, అడబిడ్డలకు కల్యాణలక్ష్మి అందిస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఆలేరు, మోత్కూరు మండలం పాటిమట్ల, వలిగొండలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో కలెక్టర్ హనుమంతరావుతో కలిసి వారు వేర్వేరుగా మాట్లాడారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల మోడల్హౌస్ను ఐలయ్య పరిశీలించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పునాది తీయగా, 73 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కుంభం అందజేశారు.