
నిజామాబాద్, వెలుగు: నాన్స్టాప్గా కీబోర్డు వాయించి గిన్నిస్బుక్ఆఫ్రికార్డు సాధించాడు ఇందూర్ కు చెందిన స్కూల్ విద్యార్థి. సిటీలోని రాజీవ్నగర్కాలనీకి చెందిన బోగం బాలరాజ్, అనితల కొడుకు విజయ్రాజ్(14) స్థానిక ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో తొమ్మిదో క్లాస్చదువుతున్నాడు. కీ బోర్డుపై ఇష్టం పెంచుకుని కొద్ది కాలంలోనే పట్టు సాధించాడు. హైదరాబాద్లోని అంతర్జాతీయ హలెల్ మ్యూజిక్ స్కూల్మేనేజ్మెంట్కీ బోర్డు ఈవెంట్లో గిన్నిస్ రికార్డుకు ఎనిమిది దేశాల నుంచి ఎంట్రీలు ఆహ్వానించింది.
మొత్తం 1,046 మంది పేర్లు నమోదు చేసుకోగా.. ఏడాది పాటు ఆన్లైన్ కీబోర్డ్ ప్లేయింగ్లో శిక్షణ ఇచ్చింది. 2024 డిసెంబర్1న 1,046 మందితో ఒకే టైంలో గంట పాటు ఆన్లైన్లో నాన్స్టాప్ కీబోర్డు ప్లే ఈవెంట్ను హలెల్ మ్యూజిక్ స్కూల్నిర్వహించింది. అనంతరం గిన్నిస్లో చోటు కోసం ప్రోగ్రామ్ ను పంపింది. దీంతో గిన్నిస్ బుక్ఆఫ్రికార్డ్స్ ప్రతినిధులు విజయ్రాజ్ను ఎంపిక చేశారు. సోమవారం హైదరాబాద్లోని మణికొండలో నిర్వహించిన ప్రోగ్రామ్ లో గిన్నిస్ సంస్థ ప్రతినిధి ఆగస్టీన్సర్టిఫికెట్, మెడల్ అందించారు.