
హైదరాబాద్, వెలుగు: త్రిపుర గవర్నర్గా ఈ నెల 26న నల్లు ఇంద్రసేనారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ఆయన్ని త్రిపుర గవర్నర్గా నియమిస్తూ రాష్ర్టపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. మూడు సార్లు మలక్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రసేనారెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా పనిచేశారు.