
కొడంగల్, వెలుగు : వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం భూ సర్వే స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా సోమవారం దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో నాలుగు టీమ్స్ సర్వేను మొదలు పెట్టాయి. రైతుల అంగీకారంతో సర్వే నిర్వహిస్తున్నట్లు దుద్యాల తహసీల్దార్కిషన్ తెలిపారు. మొత్తం 1,234 ఎకరాల్లో ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ఏర్పాటు చేస్తోందన్నారు. ఇందుకోసం పోలేపల్లిలో 130 ఎకరాలు, హకీంపేటలో 497 ఎకరాలు, లగచర్లలో 607 ఎకరాలు సేకరించనున్నట్లు చెప్పారు. భూసేకరణకు సంబంధించి ఇప్పటికే గెజిట్నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. ఇటీవల జరిగిన లగచర్ల ఘటన నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య సర్వే చేపట్టారు.