ఇండస్ట్రియల్​ కాంక్లేవ్​ 2.0 సక్సెస్

ఇండస్ట్రియల్​ కాంక్లేవ్​ 2.0 సక్సెస్

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అంతరాలను తగ్గించడానికి గీతం యూనివర్సిటీ కెరీర్​ గైడెన్స్​సెంటర్​ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఇండస్ట్రియల్​ కాంక్లేవ్​2.0 విజయవంతమైంది. వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులు, సీఈవోలు ఈ కాంక్లేవ్​ ద్వారా యువ పరిశ్రమ నిపుణులకు, స్టూడెంట్స్​కు అవగాహన కల్పించారు. ఆర్డినెన్స్​ఫ్యాక్టరీ ఉన్నతాధికారి విజయదత్, ఎట్ నెస్ట్​ఆపరేషన్స్​ఆఫీసర్​సీహెచ్​నెహ్రూ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయా పరిశ్రమల నిపుణులతో జరిగిన ప్యానల్​చర్చలలో భాగంగా ఆటోమేషన్​టూ ఆగ్మెంటేషన్, మానవ కేంద్రీకృత వ్యూహాలు, ఆర్టిఫిషియల్​ఇంటలిజెన్స్​తదితర అంశాలపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ.. వేగంగా మారుతన్న టెక్నాలజీ ప్రపంచంలో సందర్భోచితంగా మన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీసీ డీఎస్​రావు, స్కూల్​ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్​రామశాస్త్రి, సీజీసీ డైరెక్టర్​మమత, వివిధ బహుళ జాతి సంస్థల ప్రతినిధులు, పరిశోధకులు పాల్గొన్నారు.