రూ. 32 వేల కోట్లు కట్టండి..ఇన్ఫోసిస్​కు జీఎస్టీ నోటీసు

రూ. 32 వేల కోట్లు కట్టండి..ఇన్ఫోసిస్​కు జీఎస్టీ నోటీసు

న్యూఢిల్లీ: మనదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్​ రూ.32,403 కోట్ల జీఎస్టీ కట్టాలంటూ ప్రీషోకాజ్​నోటీసు జారీ అయింది.  2017 నుంచి ఐదేళ్ల వరకు ఇన్ఫోసిస్ తన విదేశీ శాఖల నుండి పొందిన సేవల కోసం పన్ను చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు.  

 జూలై 2017 నుంచి 2021–-22 వరకు రూ. 32,403.46 కోట్లను ఐజీఎస్టీగా చెల్లించాలని స్పష్టం చేశారు. దీనిపై ఇన్ఫీ స్పందిస్తూ ఈ ఖర్చులకు జీఎస్టీ వర్తించబోదని తెలిపింది.