
కోడేరు, వెలుగు: తమ పేర్లను ఓటర్ లిస్టులో నుంచి తొలగించారని మండలంలోని ముత్తిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన 115 మంది ఫిర్యాదు చేయడంతో, అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ విచారణ చేపట్టారు. తహసీల్దార్ ఆఫీస్లో విచారణ చేపట్టి, 60 మంది పేర్లు లిస్ట్లో లేనట్లు గుర్తించారు. అర్హులైన వారిని విచారించి పేర్ల నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు చెప్పారు. అర్హులైన వారి పేర్లు తిరిగి నమోదు చేస్తున్నామని, కొన్ని పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటిపై విచారణ చేసి సమస్య పరిష్కరిస్తానని తెలిపా. అంజన్ గౌడ్, శరత్ చంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, స్వామి, భాస్కర్ ఉన్నారు.