
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని శివాజీనగర్లోని రవితేజ హెచ్పీ గ్యాస్ గోదాంలో డిస్ట్రిక్ట్ సివిల్సప్లై ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను చెక్ చేశారు. గోదాంలో బుక్స్ మెయింటైన్ చేయకపోవడం, ఖాళీ సిలిండర్లను కంపెనీకి పంపకపోవడం, హెచ్పీ కంపెనీవి కాకుండా ఇతర కంపెనీలకు చెందిన 24 సిలిండర్లను గోదాములో ఉంచడం, 285 హెచ్పీ సిలిండర్లకు సంబంధించి లెక్క తేలకపోవడం, తదితర అంశాలను తనిఖీల్లో గుర్తించారు. దీంతో గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్టు జిల్లా అధికారి ప్రేమ్కుమార్ తెలిపారు.