అయ్యో పాపం: ఇంటర్​ పరీక్షలు రాస్తుండగా ఫిట్స్​.. నాచారం ఈఎస్​ఐకు తరలింపు

అయ్యో పాపం:  ఇంటర్​ పరీక్షలు రాస్తుండగా ఫిట్స్​.. నాచారం ఈఎస్​ఐకు తరలింపు

మేడ్చల్​ జిల్లా కీసర శ్రద్దా కళాశాలలో  అపశృతి చోటు చేసుకుంది. ఇంటర్​రెండో సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థిని ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది.  ఈ విషయాన్ని గమనించి సిబ్బంది.. వెంటనే దగ్గరలో ఉన్న నాచారం ఈఎస్​ఐ ఆస్పత్రికి తరలించారు.

దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే రెండో సంవత్సరం ఎకనామిక్స్​ ఎగ్జామ్​ రాస్తున్న ప్రవల్లికకు ఫిట్స్​రావడంతో కింద పడిపడిపోయింది.  పరీక్ష మొదలైన కొద్దిసేపటికే మళ్లీ రెండు మూడు సార్లు ఫిట్స్​ వచ్చాయి. దీంతో  వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఎదురుగా ఉన్న అద్విత్ ప్రయివేట్ హాస్పటిల్ కి తీసుకెళ్లిన ప్రవళికకు ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించారు. అనంతరం 108 లో నాచారం లోని ఈ ఎస్ ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ప్రవల్లిక ఆరోగ్యం నిలకడగా ఉంది.ప్రవల్లిక బాలాజీ నగర్ వాసి శ్రీ వైష్ణవి కళాశాలలో ఇంటర్ చదువుతోంది. పరీక్షలు .. కీసర శ్రద్ధ కళాశాలలో ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తుంది.