
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రి
- సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో ఘటన
గజ్వేల్(వర్గల్), వెలుగు: ఇంటి వద్ద తండ్రి డెడ్ బాడీ .. దు:ఖాన్ని దిగమింగుకుని మరోవైపు విద్యార్థిని ఇంటర్ఎగ్జామ్ కు హాజరైంది. సిద్దిపేట జిల్లా వర్గల్మండల కేంద్రానికి చెందిన పసుల లింగం(50) కారు డ్రైవర్. అతనికి భార్య యాదమ్మ, కూతురు తేజశ్రీ, కొడుకు సాయికుమార్ఉన్నారు. మంగళవారం రాత్రి ఇన్నోవాలో తూప్రాన్ వెళ్లి తిరిగి వస్తుండగా నాచారం వద్ద గజ్వేల్ – -తూప్రాన్ రహదారిపై అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
అతడిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం కూతురు తేజశ్రీకి ఇంటర్ఫస్టియర్తొలి పరీక్ష ఉంది. ఇంట్లో తండ్రి డెడ్ బాడీ ఉండగా.. కూతురు బాధను దిగమింగుకుని పరీక్షకు హాజరైంది. పూర్తయిన తర్వాత తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంది. ఘటన గ్రామస్తులను కూడా కంటనీరు పెట్టించింది.