మూసీ నిర్వాసితులకు వడ్డీలేని రుణాలు

మూసీ నిర్వాసితులకు వడ్డీలేని రుణాలు
  • ఇప్పటికే 172 ఫ్యామిలీలతో  లిస్ట్ ఫైనల్!​

హైదరాబాద్ సిటీ, వెలుగు : మూసీ రివర్​బెడ్ ​నిర్వాసితులకు డబుల్​ఇండ్లతో పాటు ఖర్చుల కోసం రూ.25 వేలు చెల్లించిన ప్రభుత్వం.. తాజాగా వారికి వడ్డీ లేని రుణాలనూ ఇవ్వనుంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే డబుల్​ఇండ్లకు తరలిన కుటుంబాలలోని మహిళలతో 17 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆయా గ్రూపుల్లో మొత్తం 172 మంది మహిళలను గుర్తించి, వారికి గ్రూపుల వారీగా, విడివిడిగా బ్యాంకు అకౌంట్లు కూడా ఓపెన్​ చేయించినట్లు సమాచారం. అర్బన్​ కమ్యూనిటీ డెవలప్​మెంట్(యూసీడీ) నుంచి స్త్రీనిధి ద్వారా స్వయం సహాయక బృందాలకు వ్యాపారం

ఇతర వృత్తులు చేసుకోవడానికి వడ్డీ లేని రుణాలను అందించడానికి చర్యలు చేపడుతున్నారు.  అలాగే.. డబుల్​ఇండ్లకు తరలిన కుటుంబాల్లో పిల్లల్ని గుర్తించి, సమీపంలోని స్కూళ్లలో  జాయిన్ చేస్తున్నారు. హైదరాబాద్​ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం159 మంది పిల్లల్ని గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం 37 మంది పిల్లల్ని డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లకు సమీపంలో ఉన్న స్కూళ్లలో జాయిన్​ చేశామని అధికారులు తెలిపారు. మరికొందరు గురుకులాల్లో చేరడానికి ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారని చెప్పారు. వారం రోజుల్లో దాదాపు అందరినీ స్కూళ్లలో జాయిన్​ చేస్తామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.