రూట్ మార్చిన సాయి దుర్గ తేజ్.. ఈసారి ప్యాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడుగా..

రూట్ మార్చిన సాయి దుర్గ తేజ్.. ఈసారి ప్యాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడుగా..

టాలీవుడ్ స్టార్ హీరో సాయి దుర్గ తేజ్ విభిన్న కథనాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. గతంలో సాయి తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష, బ్రో చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో ఈసారి సాయి తేజ్ రూట్ మార్చాడు. ఈ క్రమంలో ఏకంగా ప్యాన్ ఇండియాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రజలని పట్టి పీడిస్తున్న అరాచక శక్తుల్ని అంతం చేసి జనాలని రక్షించే గొప్ప వీరుడి స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోంది.

ఈ రోజు (అక్టోబర్ 15) సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ ఎస్డిటీ-18 చిత్రానికి సంబంధించిన ఇంట్రో వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సాయి దుర్గ తేజ్ సిక్స్ ప్యాక్ బాడీతో పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు. ఇక విజువల్స్ లోని పల్లెటూరు, మంటల్లోనుంచి హీరో ఎంట్రీ ఎస్డిటీ-18 సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.   

ALSO READ | Vettaiyan: వెట్టయన్‌ బడ్జెట్‌ ఎంత.. కలెక్షన్స్ ఎంతోచ్చాయి? నటీనటులు రెమ్యూనరేషన్‌ లెక్కల వివరాలు!

ఈ చిత్రానికి నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తుండగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం తదితర పాన్-ఇండియా భాషలలో విడుదల కానుంది.