
- ప్రస్తుత హిమాలయాల భూభాగంలో మధ్యయుగంలో టెథిస్ సముద్రం అనే ఒక పెద్ద భూ అభినతి ఉండేది.
- టెథిస్ సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని అంగారా భూమి అని దక్షిణంగా ఉన్న భూభాగాన్ని గోండ్వానా భూమి (నేటి ద్వీపకల్పం) అని పిలిచేవారు.
- టెర్షియరీ యుగంలో అంగారా భూమి, గోండ్వానా భూమి ఒక దానికి ఒకటి వ్యతిరేక దిశలో జరగడం వల్ల టెథిస్ సముద్రంలో ఉన్న అవక్షేప శిలలు సంపీడన బలాల వల్ల ముడతలు పడి హిమాలయాలు ఏర్పడ్డాయి.
- భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా హిమాలయాల ప్రాంతాల్లో సంభవిస్తాయి.
- ఇవి ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాలు.
- ఇవి నవీన లేదా తరుణ ముడత పర్వతాలు. వయస్సు ఆరు కోట్ల సంవత్సరాలు.
- హిమాలయాలు సింధు నదీలోయ, బ్రహ్మపుత్ర నదీలోయల మధ్య జమ్ముకశ్మీర్ నుంచి అరుణాచల్ప్రదేశ్ల మధ్య కొడవలి ఆకారంలో లేదా అర్ధ చంద్రాకారంలో విస్తరించి ఉన్నాయి.
- వీటి పొడవు సుమారు 2400 కి.మీ., విస్తీర్ణం 5 లక్షల చ.కి.మీ.
- వీటి వెడల్పు అరుణాచల్ప్రదేశ్లో 200 కి.మీ.లు కాగా, కశ్మీర్లో 500 కి.మీ.ల ఉంది. సరాసరి వెడల్పు 240 కి.మీ.
- స్థూలంగా చూస్తే హిమాలయాల్లో మూడు సమాంతర ముడత శ్రేణులు ఉన్నాయి.
- 1. ఎ. ఉత్తరంగా ఉన్న హిమాద్రి
- (ఉన్నత హిమాలయాలు)
- బి. మధ్యన ఉన్న హిమాచల్
- (నిమ్న హిమాలయాలు)
- సి. దక్షిణంగా ఉన్న శివాలిక్ శ్రేణి
- (బాహ్య హిమాలయాలు)
- 2. ట్రాన్స్ హిమాలయాలు లేక టిబెట్ హిమాలయాలు. ఇవి అత్యున్నత హిమాలయాలు పైన ఉన్నాయి.
- 3. తూర్పు హిమాలయాలు లేదా పూర్వాంచల్ హిమాలయాలు
- ఎ. హిమాద్రి (గ్రేటర్ హిమాలయాలు)
- హిమాలయ పర్వత శ్రేణులన్నింటిలోకి ఇది అత్యున్నత, ఉత్కృష్ట, అవిఛ్చిన్న శ్రేణి.
- వీటి సరాసరి ఎత్తు సుమారు 6100 మీటర్లు. వెడల్పు 25 కి.మీ.
- ఇది నంగప్రభాత్ శిఖరం నుంచి నామ్చాబార్వా శిఖరం మధ్యలో ఉంది.
- ఈ పర్వత శ్రేణిలో ప్రపంచంలోనే ఎత్తయిన పర్వత శిఖరాలు ఉన్నాయి. మొత్తం 11 శిఖరాలు ఉన్నాయి.
- 1. ఎవరెస్ట్ శిఖరం
- ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం.
- దీని పొడవు 8848 మీటర్లు. లేదా 29,035 అడుగులు. (ప్రస్తుత ఎత్తు 8850 మీటర్లు)
- ఇది నేపాల్లో ఉంది.
- ఈ శిఖరాన్ని నేపాల్లో సాగరమాత అని, టిబెట్లో చోమోలుంగుమో అని, చైనాలో కెమోలుంబుమో అని పిలుస్తారు.
- బ్రిటీష్ సర్వేయర్ జనరల్ సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా దీనిని ఎవరెస్ట్ అని పిలుస్తారు.
- 2. కే2 (గాడ్విన్, ఆస్టిన్)
- ఇది ట్రాన్స్ హిమాలయాల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది.
- ఇది భారతదేశంలో ఎత్తయిన శిఖరం. దీని ఎత్తు 8611 మీటర్లు.
- ఈ శిఖరాన్ని క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తారు.
- ఈ శిఖరాన్ని భారతదేశంలో కృష్ణగిరి అని, పాకిస్తాన్లో చెగౌరి అని, చైనాలో ఖ్వఘర్ అని పిలుస్తారు.
- 3. కాంచనగరం
- దీని ఎత్తు 8598 మీటర్లు.
- భారతదేశంలో రెండో ఎత్తయిన శిఖరం.
- సిక్కింలో ఉంది.
- 4. మకాలు
- దీని ఎత్తు 8481 మీటర్లు. నేపాల్లో ఉంది.
- 5. ధవళగిరి
- దీని ఎత్తు 8177 మీటర్లు. నేపాల్లో ఉంది.
- 6. నంగప్రభాత్
- దీని ఎత్తు 8126 మీటర్లు. ఇది జమ్ముకశ్మీర్లో ఉంది.
- 7. అన్నపూర్ణ
- దీని ఎత్తు 8078 మీటర్లు, ఇది నేపాల్లో ఉంది.
- ఇతర పర్వత శిఖరాలు మనస్లూ (8156 మీటర్లు), చోఓయు (8153 మీటర్లు), నందదేవి (7817 మీటర్లు), నామ్చాబార్వా (7756 మీటర్లు) కూడా ఇక్కడే ఉన్నాయి.
- ఈ పర్వత శ్రేణిలో కింది ముఖ్యమైన కనుమలు ఉన్నాయి.
- 1. బనిమల్ కనుమ: దీనిగుండా జవహర్ సొరంగం పోవుతున్నది. ఈ కనుమను గేట్ వే ఆఫ్ కశ్మీర్ అని అంటారు.
- 2. జోజలా కనుమ: ఇది లే, జమ్ము ప్రాంతాలను కలుపుతుంది.
- 3. షిప్కిలా కనుమ: ఈ కనుమ గుండా సట్లెజ్ నది టిబెట్ నుంచి భారతదేశంలోకి ప్రవేశిస్తోంది.
- 4. రోహతంగ్ కనుమ: ఇటీవల భారత ప్రభుత్వం ఈ కనుమగుండా 8.8 కి.మీ. పొడవైన సొరంగం ప్రారంభించింది. ఇది మనాలి, లఢఖ్లను కలుపుతుంది.
- 5. నాథులా కనుమ: సిక్కిం రాష్ట్రంలోని ఈ కనుమను 1962లో భారత్– చైనా యుద్ధం సందర్భంగా మూసివేశారు. తిరిగి 44 సంవత్సరాల తర్వాత 2006లో మళ్లీ ప్రారంభించారు.