
హనుమకొండ/జనగామ/ ములుగు, వెలుగు: ఇంటర్మీడియెట్పబ్లిక్ఎగ్జామినేషన్స్ నిర్వహణపై జిల్లా అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ నెల 5వ తేదీ నుంచి 25వ తేదీ పరీక్షలు జరగనుండగా, ఆఫీసర్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 37,877 మంది ఉండగా, ఫస్ట్ ఇయర్ 18,397 మంది, సెకండ్ ఇయర్ 19,480 మంది ఉన్నారు. ఒకేషనల్ గ్రూపులకు సంబంధించి 2,103 మంది ఉండగా, అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 1,146 మంది, సెకండ్ ఇయర్ లో 957 మంది ఉన్నారు.
ఈ మేరకు పరీక్షల నిర్వహణకు జిల్లా అధికారులు 55 సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు,, సిట్టింగ్ స్క్వాడ్స్ 4, చీఫ్ సూపరింటెండెంట్లు 55 మంది, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 55 మంది, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్ 42 మందిని నియమించారు. జనగామ జిల్లాలో మొత్తం 17 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్రెడ్డి తెలిపారు.
మొత్తంగా 8945 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, 4251 మంది ఫస్ట్ ఇయర్, 4694 మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్లు ఉన్నట్లు వివరించారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ములుగు కలెక్టర్ దివాకర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 3,793 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా, 10 కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.