
ప్రస్తుతం ఎక్కడ చూసినా కుంభమేళా గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. అయితే, హర్యానాలో మరో మేళా గురించి కూడా జోరుగా వినిపిస్తోంది. అదే సూరజ్కుండ్ మేళా. ఈ నెల 7వ తేదీన మొదలైన ఈ మేళా 23వ తేదీవరకు కొనసాగనుంది. ఇంతకీ ఈ మేళా సంగతులేంటి? తెలుసుకుందాం..
హర్యానాలోని ఫరిదాబాద్లో 38వ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా ఘనంగా జరుగుతోంది. ఈ మేళాలో కళ్లు చెదిరే క్రాఫ్ట్లు కనిపిస్తాయి. రీజినల్, ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్తో పాటు ట్రెడిషనల్ ఫుడ్ వెరైటీలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. దేశీ, విదేశీయులతో కలిపి మిలియన్కు పైగా ప్రజలతో అక్కడ సందడి నెలకొంది. ఈ మేళాను సూరజ్కుండ్ మేళా అథారిటీ, హర్యానా టూరిజం డిపార్ట్మెంట్కు సంబంధించిన యూనియన్ మినిస్ట్రీలు కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఈ మేళా ప్రతిరోజు ఉదయం10:30కి మొదలై 8:30లకు ముగుస్తుంది. ఇక్కడకు వచ్చే విజిటర్స్ కోసం హస్తకళలు, టెక్స్ట్టైల్స్ వంటివాటితో వెయ్యికి పైగా స్టాల్స్ ఉన్నాయి.
ఈ మేళా కోసం మొట్టమొదటిసారి ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (డిఎంఆర్సి) టికెట్స్ అమ్మకాన్ని సులభతరం చేసింది. మెట్రో స్టేషన్లోనే కాదు.. ఆన్లైన్, ఆఫ్సైట్లో కూడా టికెట్స్ కొనొచ్చు. మామూలు రోజుల్లో టికెట్ ధర రూ.120 ఉంటే వారాంతాల్లో రూ.180 ఉంటుంది. ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనలను ఈ మేళాలో లైవ్గా చూడొచ్చు.