![గీతం వర్శిటీలో ముగిసిన ఇంటర్నేషనల్ సెమినార్](https://static.v6velugu.com/uploads/2025/02/international-seminar-concluded-at-geetham-university_Fe7xdRHYos.jpg)
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పరిధిలోని గీతం వర్శిటీలో మూడు రోజులుగా కొనసాగిన ఇంటర్నేషనల్ సెమినార్ శుక్రవారంతో ముగిసింది. ఫార్మాస్యూటికల్, ఆరోగ్య శాస్ర్తాల్లో సమగ్ర ధోరణలు అంశంపై నిర్వహించిన ఈ సెమినార్కు దేశ, విదేశాల నుంచి శాస్ర్తవేత్తలు, ఔషధ నిపుణులు, అంతర్జాతీయ వర్సిటీల ప్రతినిధులు పాల్గొన్ని తమ ఆవిష్కరణలను పంచుకున్మారు. చివరి రోజు ఐఈఎఫ్ఆర్ ఫౌండర్ ఉదయ్ సక్సేనా, ఎన్వేదా థెరప్యూటిక్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రామచంద్రన్, దక్షిణ కొరియా నుంచి ప్రొఫెసర్ గెడ్డా హాజరై ఆరోగ్య సంరక్షణ, ఔషధ ఆవిష్కరణల భవిష్యత్పై అభిప్రాయాలను వెల్లడించారు.
సెమినార్ ఆర్గనైజర్ ప్రతీక్పాఠక్ మాట్లాడుతూ ఈ సదస్సు ప్రపంచ జ్ఞాన సమ్మేళనంగా నిలిచిందని, గొప్ప చర్చలు, పరిశ్రమల భవిష్యత్ను రూపొందించే సవాళ్లు, అవకాశాలపై అవగాహన పెంపొందించిందని పేర్కొన్నారు. 60 కి పైగా ఎగ్గిబిట్లు, వందకు పైగా పోస్టర్ ప్రదర్శనలు, 15 మంది నిపుణుల ఉపన్యాసాలు, దేశ విదేశాలకు చెందిన 450 మంది ప్రముఖులు పాల్గొన్నట్లు తెలిపారు.