
న్యూఢిల్లీ : స్టార్టప్లు తమ ఆలోచనలను ప్రదర్శించడానికి, పెట్టుబడిదారులను కలవడానికి, నెట్వర్కింగ్ చేసుకోవడానికి హైదరాబాద్లో గురువారం ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా పిచ్ కాంపిటీషన్స్ నిర్వహించారు.
ఇందులో స్టార్టప్లు తమ ఆలోచనలను ప్రదర్శించి పెట్టుబడులు, ఇతర బహుమతులు గెలుచుకున్నాయి. స్టార్టప్లకు అవసరమైన వివిధ రంగాలలో వర్క్షాప్లు నిర్వహించాయి. స్టార్టప్లు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, యాక్సలరేటర్లు మొదలైన వారితో నెట్వర్కింగ్ జరిగింది. స్టార్టప్లు తమ ఉత్పత్తులను, సేవలను ప్రదర్శించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశాయి.