
ముంబై: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండటంతో మంగళవారం (April 30) సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. బ్లూ-చిప్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లలో భారీ కొనుగోళ్లు, నిరంతర విదేశీ మూలధన ప్రవాహం దేశీయ మార్కెట్లో జోష్నింపింది. 30-షేర్ల సెన్సెక్స్ 70.01 పాయింట్లు పెరిగి 80,288.38 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడేలో ఇది 442.94 పాయింట్లు పెరిగి 80,661.31 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7.45 పాయింట్లు స్వల్పంగా పెరిగి 24,335.95 వద్ద ఆగింది. సెన్సెక్స్ సంస్థలలో, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బజాజ్ ఫిన్సర్వ్ లాభపడ్డాయి. మార్కెట్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) మంగళవారం రూ. 2,386 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.