
వచ్చే ఏడాది విడుదల చేయనున్న ఫోన్లలో ప్రస్తుతం ఉన్న ‘ఫేస్ ఐడీ, ఫింగర్ప్రింట్ స్కానర్’ను తొలగించనున్నట్లు యాపిల్ ప్రకటించింది. అయితే సొంత అథెంటికేషన్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఇప్పుడున్న ఫేస్ఐడీ, టచ్ ఐడీ బదులు ‘అండర్ డిస్ప్లే ఫింగర్ప్రింట్’ టెక్నాలజీని రూపొందిస్తోంది. 2021 నుంచి రాబోయే ఫోన్లలో నాచ్ లేకుండా ఫుల్స్క్రీన్ డిస్ప్లే ఉంటుందని తెలిపింది. యాపిల్ వాచ్కు సంబంధించి ‘వాకీటాకీ’ యాప్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఒక యూజర్ సమాచారాన్ని (వాయిస్ చాట్) మరో యూజర్ తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ యాప్ను తొలగిస్తున్నట్లు యాపిల్ తెలిపింది.