
ముంబై: ఐపీఎల్-–18లో చెన్నై సూపర్ కింగ్స్ సన్రైజర్స్ హైదరాబాద్ తమ జట్లలో స్పల్ప మార్పులు చేశాయి. గాయపడిన ఆటగాళ్లకు బదులుగా కొత్త ప్లేయర్లను తీసుకున్నాయి. ఈ సీజన్ ఐపీఎల్ నుంచి తప్పుకున్న చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్లో ముంబై బ్యాటర్ ఆయుష్ మాత్రె ఆ టీమ్లోకి వచ్చాడు.
17 ఏండ్ల ఆయుష్ 9 ఫస్ట్ క్లాస్, 7 లిస్ట్– ఎ మ్యాచ్ల్లో మొత్తం 962 రన్స్ చేశాడు. ఈ కుర్రాడిని సీఎస్కే రూ.30 లక్షలకు జట్టులోకి తీసుకుంది. మరోవైపు సన్ రైజర్స్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా గాయంతో లీగ్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో సన్ రైజర్స్ కర్నాటక బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ను తీసుకుంది. స్మరన్ 7 ఫస్ట్ క్లాస్, 10 లిస్ట్–ఎ, 6 టీ20 మ్యాచ్ల్లో కలిపి 1100కి పైగా రన్స్ చేశాడు. జంపా స్థానంలో స్మరన్