
టెహ్రాన్: తమ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్పై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. రెండు రోజులుగా ఇజ్రాయెల్ జరిపిన దారుణ చర్యలను తక్కువ చేసి చూడొద్దని, అదే సమయంలో అతిగా భావించొద్దని అన్నారు. ఇజ్రాయెల్కు ఇరాన్ సత్తాను చూపించాలని తెలిపారు. దీనిపై ఎలా స్పందించాలనేది అధికారులే నిర్ణయిస్తారని ఖమేనీ చెప్పినట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి.