Jai Hanuman: జై హనుమాన్లో కాంతారా హీరో రిషబ్ శెట్టి.. హనుమంతుడి పాత్రను వదలుకున్న మరో స్టార్ హీరో..!

Jai Hanuman: జై హనుమాన్లో కాంతారా హీరో రిషబ్ శెట్టి.. హనుమంతుడి పాత్రను వదలుకున్న మరో స్టార్ హీరో..!

జై హనుమాన్(Jai Hanuman).. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ చూపులన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. హనుమాన్(HanuMan) సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి.

ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తెరెకక్కించిన ఈ సినిమాటిక్ బ్రిలియన్స్ కు ఇండియన్ ఆడియన్స్ తో పాటు ఓవర్ సీస్ ఆడియన్స్ సైతం నోరెళ్లబెట్టారు. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో ఆ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ను క్రియేట్ చేసి సినీ దిగ్గజాలతో సైతం శభాష్ అనిపించుకున్నాడు ప్రశాంత్. 

సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక హనుమాన్ సినిమా చివర్లో సీక్వెల్గా జై హనుమాన్ను ప్రకటించి ఆడియన్స్ అదిరిపోయే షాకిచ్చాడు ప్రశాంత్ వర్మ. ఇక అప్పటి నుండి జై హనుమన్ సినిమా రోజుకో న్యూస్ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా ఒక స్టార్ హీరో కనిపిస్తారని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఆ స్టార్ హీరో ఎవరో కాదట. కన్నడ స్టార్ హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి (Rishab Shetty) అని తెలుస్తోంది. అవును జై హనుమాన్ హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా కనిపించేది కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి  అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కాంతారా భారీ సక్సెస్ తరువాత.. రిషబ్ శెట్టి ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. అందుకే ఈ సినిమా కోసం రిషబ్ శెట్టిను తీసుకోనున్నాడట ప్రశాంత్ వర్మ. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.ఈ వార్త గనక నిజమైతే.. జై హనుమాన్ భారీ విజయం సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. మొదట ఈ పాత్రకు అనుకున్న హీరో కేజీఎఫ్ స్టార్ యష్. హనుమాన్ మేకర్స్ ముందుగా హనుమాన్ పాత్రలో నటించేందుకు యష్ ను సంప్రదించారట. యష్ కూడా అందుకు సుముఖంగానే ఉన్నాడట. కానీ అనుకోని కారణాల వలన యష్ స్థానంలో రిషబ్ ని తీసుకుంటున్నట్లు టాక్ ఉంది.

అంతేకాదు.. మొదట టాలీవుడ్ నుంచి రానా, చరణ్, చిరంజీవి పేర్లు కూడా బలంగా వినిపించాయి. మరి ఎవరు నటిస్తారనేది చూడాలి. ఇకపోతే రిషబ్ శెట్టి  కాంతారా చాప్టర్ 1 మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.