ఇజ్రాయెల్ దాడిలో బీరుట్లో 31 మంది మృతి

ఇజ్రాయెల్ దాడిలో బీరుట్లో 31 మంది మృతి

బీరుట్: లెబనాన్​ రాజధాని బీరుట్​పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 31కి పెరిగిందని లెబనాన్ హెల్త్​మినిస్టర్ ఫిరస్ అబియాద్ తెలిపారు. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నట్టు శనివారం ప్రకటించారు.

బీరుట్​పై శుక్రవారం ఇజ్రాయెల్​క్షిపణి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో మరణించినవారిలో ఎలైట్ రద్వాన్ దళాలకు నేతృత్వం వహించిన హెజ్బొల్లా కమాండర్ ఇబ్రహీం అకీల్ ఉన్నారని ఆయన తెలిపారు. అలాగే టెర్రరిస్ట్​ గ్రూపులోని పలువురు సభ్యులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు సిరియా జాతీయులు కూడా ఉన్నారని అబియాద్ తెలిపారు. ఇజ్రాయెల్ మిలిటరీ దాడిలో అకీల్‌‌ సహా మొత్తం 11 మంది హెజ్బొల్లా కార్యకర్తలు మరణించారని పేర్కొన్నారు.