గాజా స్కూల్​పై ఇజ్రాయెల్ దాడి..27 మంది మృతి

గాజా స్కూల్​పై ఇజ్రాయెల్ దాడి..27 మంది మృతి

జెరూసలెం/డిర్ అల్-బలా: గాజాపై ఇజ్రాయెల్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్​లో 27 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఏడుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న స్కూల్​పై గురువారం ఇజ్రాయెల్ దాడి చేసిందని పాలస్తీనా వైద్యాధికారులు తెలిపారు. 

అయితే పౌరుల మధ్య దాక్కున్న టెర్రరిస్టులే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్​ సైన్యం(ఐడీఎఫ్​) వెల్లడించింది. టెర్రరిస్టులు స్కూల్లో మిలిటెంట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌‌ను నడిపిస్తున్నారని దాన్నే పేల్చివేశామని పేర్కొంది. గాజాలో స్కూళ్లు మిలిటెంట్లకు ఆశ్రయంగా మారాయని ఇజ్రాయెల్ కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నది.