ఇరాన్ పై ఇజ్రాయోల్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇరాన్ సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని అక్టోబర్ 26న క్షిపణులతో కరాజ్,టెహ్రాన్ లో వైమానికి దాడులు చేసింది. టెహ్రాన్ లోని నివాసితులు పేలుళ్లు శబద్ధం వినిపించినట్లు స్థానికులు చెప్పారు. అయితే ఈ దాడులతో టెహ్రాన్ లో ఎంత నష్టం జరిగిందనేదానిపై ఇరాన్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
అక్టోబర్ 1న భారీ క్షిపణులతో ఇజ్రాయోల్ పై ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే.. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయోలో ముందుగానే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇరాన్ లోని టెహ్రాన్ లో సైనిక స్థావరాలే టార్గెట్ గా క్షిపణులతో దాడి చేసింది.
అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయోల్ పై కనికరం లేకుండా దాడులు చేస్తున్నాయి. ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయోల్ సైన్యం ప్రకటించింది. దాడికి ప్రతీకార దాడి చేసే హక్కు తమకు ఉందని ఇజ్రాయోల్ పేర్కొంది.
మరో వైపు ఇజ్రాయోల్ దాడితో ఉద్రిక్తత నెలకొనడంతో ఇరాక్ అన్ని ఎయిర్ పోర్టులను మూసివేసింది.