
డెయిర్అల్బలాహ్: 8 వారాల సీజ్ఫైర్ముగియడంతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బుధవారం గాజా పరిసర షిజాహియా ప్రాంతంలో ఓ బిల్డింగ్పై వైమానిక దాడి చేసింది. బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో మొత్తం 23 మంది పౌరులు మృతిచెందినట్టు పాలస్తీనా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇందులో 8 మంది మహిళలు, 8 మంది చిన్నారులు ఉన్నట్టు తెలిపింది. నాలుగు అంతస్తుల భవనాన్ని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడిచేసిందని, ఈ భవనం శిథిలాల కింద బాధితుల కోసం రెస్క్యూ బృందాలు వెదుకుతున్నాయని పేర్కొన్నది. అలాగే, చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కూడా దెబ్బతిన్నాయని తెలిపింది.