గాజాలోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ దాడి..33 మంది మృతి

 గాజాలోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ దాడి..33 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. శనివారం (అక్టోబర్ 19) జరిగిన ఉత్తర గాజాలోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడుల్లో 33 మంది మరణించారు. మృతుల్లో 21 మంది మహిళలు ఉన్నారు. ఈ దాడిలో 85 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్యమరింత పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 42వేల 500మంది మృతిచెందినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

ALSO READ | యుద్ధం ఆపేస్తేనే బందీలను అప్పగిస్తం: తేల్చి చెప్పిన హమాస్

మరోవైపు ఇజ్రాయెల్ పై సిరియా దాడికి ప్రయత్నించింది. సిరియా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) ప్రకటించాయి. సిరియా డ్రోన్ల ద్వారా దాడులకు ప్రయత్నించింది. అవి ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించకముందే కూల్చివేశామని తెలిపారు.