గుర్తుంచుకోండి.. మేం చేరుకోలేని ప్రదేశమే లేదు: ఇరాన్‎కు నెతన్యాహు మాస్ వార్నింగ్

గుర్తుంచుకోండి.. మేం చేరుకోలేని ప్రదేశమే లేదు: ఇరాన్‎కు నెతన్యాహు మాస్ వార్నింగ్

ఇజ్రాయెల్, లెబనాన్ కేంద్రంగా పని చేసే మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‎కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఇవాళ (సెప్టెంబర్ 27) నెతన్యాహు ప్రసంగిస్తూ.. ఇజ్రాయెల్‎పై ఇరాన్ మొదట దాడి చేస్తే.. కచ్చితంగా తిరిగి ఇరాన్‎పై ప్రతిదాడి ఉంటుందని పునర్ఘాటించారు. ‘‘మీరు మమ్మల్ని కొట్టినట్లయితే, తిరిగి మేము మిమ్మల్ని కొడతాం’’ టెహ్రాన్ నిరంకుశ పాలకులకు ఇదే నా సందేశమని పేర్కొన్నారు. 

ఇరాన్ తమపై దాడి చేస్తే తిరిగి మూల్యం చెల్లించుకోక తప్పదని.. ఇరాన్‎లో ఇజ్రాయెల్ వెళ్లలేని ప్రదేశమే లేదనే విషయం ఆ దేశం గుర్తుంచుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ యొక్క పొడవాటి చేయి చేరుకోలేని ప్రదేశం ఇరాన్‌లో లేదన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ పై దుందుడుకు చర్యలకు దిగే ముందు ఈ అంశం మొత్తం మధ్యప్రాచ్యానికి సంబంధించిన విషయమనేది దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఈ పోడియంలోని చాలా మంది ఇజ్రాయెల్‎పై అబద్ధాలు,  అసత్యాలు మాట్లాడారని.. ఆ తప్పుడు మాటలను సరిదిద్దేందుకే ఇవాళ ఇక్కడి వచ్చానని తన ప్రసంగం ప్రారంభంలో నెతన్యాహు నొక్కి చెప్పారు.

ALSO READ | మాటల్లేవ్..మాట్లాడుకోవటం లేదు..ఇక చంపుడే: లెబనాన్ కు ఇజ్రాయెల్ అల్టిమేటం

 కాగా, ఇటీవల ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య భీకర దాడులు జరిగాయి.  ఇజ్రాయెల్, హెజ్బొల్లా పరస్పరం రాకెట్లు, బాంబ్‎ల వర్షం కురుపించుకున్నాయి. హెబ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున హెజ్బొల్లా సభ్యులు, లెబనాన్ సాధారణ పౌరులు మృతి చెందారు. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో మధ్యప్రాచ్యదేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో హెజ్బొల్లాకు సహయ సహకారాలు అందించే ఇరాన్‎కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బహిరంగంగా మాస్ వార్నింగ్ ఇవ్వడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.