
దేశంలో మొదటిసారిగా ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన విక్రమ్ – సబ్ ఆర్బిటల్ (వీకే–ఎస్) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. విక్రమ్ సబ్ ఆర్బిటర్ (వీకే–ఎస్) రాకెట్ విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ చేపట్టిన ఈ మొత్తం మిషన్ను ప్రారంభ్గా నామకరణం చేశారు.
ఇస్రో సహకారంతో స్కైరూట్ ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థ తయారు చేసిన విక్రమ్–ఎస్ రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లిన పేలోడ్ల్లో ఒకటి విదేశీ సంస్థకు చెందింది. కాగా, రెండు భారత దేశ సంస్థలకు చెందినవి. ఇందులో ఒకటి చెన్నై కేంద్రంగా నడుస్తున్న స్పేస్కిడ్జ్ అనే ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన 2.5 కిలోల ఫన్–శాట్ పేలోడ్.
స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ రాకెట్కు ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్కి నివాళిగా విక్రమ్–సబ్ ఆర్బిటల్ (వీకే–ఎస్) అని నామకరణం చేశారు.