
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఏడాదిలో చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ అయింది. ఇవాళ ఉదయం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ 52 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 5 గంటల 9 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లిన వాహక నౌక.. సక్సెస్ ఫుల్ గా మూడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది ఇస్రో. 18 నిమిషాల 31 సెకన్లలో శాటిలైట్స్ ని నిర్ణీత కక్ష్యల్లోకి చేర్చింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ ఏడాదిలో ఇస్రోకు ఇదే ప్రయోగం. అలాగే ఇస్రో చైర్మన్ గా సోమనాథ్ బాధ్యతలు తీసుకున్నాక ఇది మొదటి ప్రయోగం. ఇస్రో విజయాశ్వం పీఎస్ఎల్వీ ద్వారా చేపట్టిన ప్రయోగాల్లో ఇది 54వ సక్సెస్. ఇవాళ ఉదయం చేపట్టిన ప్రయోగం ద్వారా ఆర్ఐశాట్-1, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్ స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను కక్ష్యలో చేర్చింది. వీటిలో 1710 కిలోల బరువైన ఆర్ఐశాట్-1 పదేళ్ల పాటు సేవలను అందించనుంది. వ్యవసాయం, అటవీ, జల వనరుల నిర్వహణకు సంబంధించిన విలువైన సమాచారాన్ని శాటిలైట్ ఇమేజింగ్ డేటా రూపంలో ఎప్పటికప్పుడు ఇస్రో కమాండ్ సెంటర్ కు పంపనుంది.
#WATCH | Indian Space Research Organisation launches PSLV-C52/EOS-04 from Satish Dhawan Space Centre, Sriharikota
— ANI (@ANI) February 14, 2022
(Source: ISRO) pic.twitter.com/g92XSaHP9r
భారత్, భూటాన్ కలిసి చేసిన శాటిలైట్
ఐఎన్ఎస్-2టీడీ శాటిలైట్ ను భారత్, భూటాన్ కలిసి రూపొందించాయి. ఈ ఉపగ్రహం లైఫ్ టైమ్ ఆరు నెలలు. భవిష్యత్తు సైన్స్, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం దీనిని డెవలప్ చేశారు. దీని బరువు 17.5 కిలోలు. ఇక ఇన్ స్పైర్ శాట్-1 ఉపగ్రహాన్ని దేశంలోని పలు యూనివర్సిటీల విద్యార్థులు కలిసి డెవలప్ చేశారు. తక్కువ భూకక్ష్యలో ఉండే ఈ ఉపగ్రహం అయానోస్పియర్ స్టడీ కోసం రూపొందించారు. ఏడాది పాటు ఇది సేవలను అందించనుంది.